మహబూబ్‌నగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సిఎం తెలంగాణ రచ్చబండ రసాభాస: ఉద్రిక్తత మధ్య ముగించిన కిరణ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
మహబూబ్‌నగర్: జిల్లాలోని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి రచ్చబండ కార్యక్రమం రసాభాసగా మారింది. మహబూబ్‌నగర్ జిల్లాలోని కొల్లాపూర్ నియోజకవర్గం కోడేరు మండలం సింగాయపల్లిలో గురువారం ముఖ్యమంత్రి రచ్చబండలో పాల్గొన్నారు. అయితే పలువురు తెలంగాణవాదులు ఆయన కాన్వాయ్ అడ్డుకున్నారు. పోలీసులు వారిని తప్పించి సిఎంను పంపించారు. ఆ తర్వాత సిఎం రచ్చబండలో ప్రసంగిస్తున్న సమయంలో పలువురు తెలంగాణవాదులు నిలబడి జైతెలంగాణ అంటూ నినాదాలు చేశారు. కొందరు వేదికపైకి కుర్చీలు విసిరారు.

దీంతో అప్రమత్తమైన పోలీసులు వారిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నాలు చేశారు. పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగింది. చివరకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం సిఎం ప్రసంగించారు. రచ్చబండను అడ్డుకున్నా ఆగదని చెప్పారు. ఎన్ని ఆటంకాలు సృష్టించినా అభివృద్ధి విషయంలో రాజీ లేదన్నారు. రచ్చబండను అడ్డుకున్న చోట మళ్లీ చేపడతామని చెప్పారు. రచ్చబండ అభివృద్ధి కార్యక్రమమని దానిని అడ్డుకోవడం సరికాదన్నారు. మొత్తానికి సిఎం రచ్చబండ కార్యక్రమాన్ని తీవ్ర ఉద్రిక్తతల మధ్య ముగించారు. కాగా ముఖ్యమంత్రి రచ్చబండ కార్యక్రమంలో తెలంగాణవాదుల అరెస్టుకు నిరసనగా మహబూబ్‌నగర్లో ఐదు బస్సులను, మూడు కార్లను ధ్వంసం చేశారు. డిఎస్పీ వాహనంపై కూడా దాడి చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X