వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భీమిలి కోర్టుకు నటి అనుష్క డుమ్మా, కేసు వచ్చేనెల 18కి వాయిదా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Anushka
విశాఖపట్నం: తప్పుడు పత్రాలతో భూమిని కొన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ సినీ నటి అనుష్క శుక్రవారం విశాఖపట్నం జిల్లా భీమిలి కోర్టులో హాజరు కావాల్సి ఉన్నప్పటికీ హాజరు కాలేదు. అయితే ఆమె తన లాయరును పంపించింది. అనుష్కతో పాటు ప్రముఖ దర్శకుడు రాజమౌళి సతీమణి రమా రాజమౌళి సైతం తప్పుడు పత్రాలతో భూమిని కొన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. శుక్రవారం అనుష్క, రమారాజమౌళి హాజరు కావాల్సి ఉన్నప్పటికీ వారు హాజరు కాకపోవడంతో కోర్టు ఈ కేసును వచ్చేనెల 18వ తేదీకి కేసును వాయిదా వేసింది.

కాగా విశాఖ జిల్లాలోని మధురవాడ సమీపంలో మూడేళ్ల క్రితం అనుష్క, రమా రాజమౌళి తప్పుడు ధృవీకరణ పత్రాలతో భూమిని కొన్నారని నారాయణ అనే వ్యక్తి భీమిలి కోర్టులో పిటిషన్ వేశారు. మూడేళ్ల క్రితం రవితేజ, అనుష్క విక్రమార్కుడు చిత్రం చిత్రీకరణ సమయంలో అనుష్క భూమిని కొన్నారు. పిటిషన్ పరిశీలించిన కోర్టు అనుష్క, రమారాజమౌళిని కోర్టులో హాజరు కావాల్సిందిగా చెప్పింది. గతంలో కూడా కోర్టు విచారించింది. అప్పుడు కూడా అనుష్క హాజరు కాలేదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X