వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికా ట్రైవ్యాలీ విశ్వవిద్యాలయం ఇండియన్ విద్యార్థులకు చిప్ లాక్స్

By Pratap
|
Google Oneindia TeluguNews

USA
వాషింగ్టన్: అమెరికాలోని కాలిఫోర్నియాలో గల ట్రై వ్యాలీ విశ్వవిద్యాలయంలో చదువుతున్న భారత విద్యార్థుల పట్ల అమెరికా అధికారులు అమానుషంగా వ్యవహరిస్తున్నారు. వీసా మోసాలకు పాల్పడిందనే ఆరోపణలపై ఆ విశ్వవిద్యాలయాన్ని మూసి వేశారు. దీంతో భారత విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వీరిలో ఎక్కువ మంది తెలుగు విద్యార్థులున్నారు. దేశం విడిచి వెళ్లకుండా భారత విద్యార్థుల కాళ్లకు ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు చిప్ లాక్స్ వేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ఓ తెలుగు టీవీ చానెల్‌లో ప్రసారం చేసింది.

భారత విద్యార్థులను అమెరికా ఎంబసీకి పిలిపించి చిత్రహింసలకు గురి చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. విద్యార్థులను విచారించే నెపంతో వేధింపులకు గురి చేస్తున్నట్లు తెలుస్తోంది. వీసా నిబంధనలను అతిక్రమించి విద్యార్థులు అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్నారని అధికారులు ఆరోపిస్తున్నారు. తీవ్రవాదులకు, కరుడుగట్టిన నేరస్తుల కాళ్లకు మాత్రమే చిప్ లాక్స్ వేస్తారు. కానీ భారత విద్యార్థులకు ఈ చిప్ లాక్స్ వేసి అవమానిస్తున్నారు. ఇది మానవ హక్కుల ఉల్లంఘనేనని అంటున్నారు.

కాగా, భారత విద్యార్థులను ఆదుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ఎన్నారైలతో కూడిన ఆటా, తానా సంస్థలు కృషి చేస్తున్నాయి. విద్యార్థులకు న్యాయపరమైన సహాయం అందించడానికి ఆటా ఆకుల రాజేష్‌ను నియోగించింది. దీనిపై ఆకుల రాజేష్ సంస్థ గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు సమావేశం ఏర్పాటు చేసింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X