హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టిఆర్ఎస్ నియోజకవర్గ ఇంఛార్జ్‌పై చేయి చేసుకున్న ఎమ్మెల్యే విష్ణు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్: జూబ్లీహిల్స్ శాసనసభ్యుడు పి.విష్ణువర్ధన్ రెడ్డి రచ్చబండ కార్యక్రమం రసాభాసగా మారింది. శుక్రవారం ఎమ్మెల్యే విష్ణు తన నియోజకవర్గం పరిధిలోని ఎల్లారెడ్డిగూడలో రచ్చబండ కార్యక్రమానికి హాజరయ్యారు. దీంతో అక్కడకు చేరుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్రం తెలంగాణ ప్రకటించే వరకు రచ్చబండ కార్యక్రమాన్ని రద్దు చేసుకోవాలని వారు నినాదాలు చేశారు. ఎమ్మెల్యే విష్ణు రచ్చబండను బహిష్కరించాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఆందోళనకారులను అదుపు చేయడానికి ప్రయత్నాలు చేశారు. ఫలించలేదు. అయినా వారు రచ్చబండను బహిష్కరించాలని డిమాండ్ చేశారు. దాంతో ఆగ్రహం చెందిన ఎమ్మెల్యే విష్ణు అక్కడున్న టిఆర్ఎస్ నియోజకవర్గం ఇంఛార్జ్‌ సతీష్‌రెడ్డిపై చేయి చేసుకున్నారు.

కాగా చేనేత జౌళీ శాఖామంత్రి మంత్రి శంకరరావు బోయినపల్లిలో రచ్చబండ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమం ప్రారంభమైన 10 నిమిషాలకే మంత్రి హడావుడిగా లేచి వెళ్లిపోయారు. అయితే మంత్రి వెళుతుండటాన్ని గమనించిన కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు సార్ అదేంటి వెళుతున్నారు అని ప్రశ్నించగా, నాకు గవర్నర్ నరసింహన్‌తో అపాయింట్‌మెంటు ఉందని, అందుకే వెళుతున్నానని చెప్పి అక్కడినుండి సరాసరిగా గవర్నర్ భేటీకి వెళ్లిపోయారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X