కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రచ్చబండలో అధికారులపై టమోటాల దాడి, లాఠీచార్జీ, ఉద్రిక్తం

By Pratap
|
Google Oneindia TeluguNews

Karimnagar District
కరీంనగర్: రచ్చబండ కార్యక్రమానికి వచ్చిన అధికారులపై కరీంనగర్ జిల్లా గూడూరులో తెలంగాణవాదులు టమోటాలతో దాడి చేశారు. ఈ సంఘటన శనివారం ఉదయం చోటు చేసుకుంది. ఆందోళనకారులపై పోలీసులు లాఠీ చార్జీ చేశారు. 20 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఆందోళనకారులు మూడు ప్రభుత్వ వాహనాలను ధ్వంసం చేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రచ్చబండను అడ్డుకోవడానికి విద్యార్థులు ప్రయత్నించారు.

కాగా, జిల్లాలోని పలు చోట్ల రచ్చబండ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి తెలంగాణవాదులు ప్రయత్నాలు సాగించారు. కమలాపురం మండలం శ్రీరాములపల్లిలో తెలంగాణవాదులు రచ్చబండకు వచ్చిన అధికారులపై కోడిగుడ్ల దాడి చేశారు. తీవ్రమైన వ్యతిరేకత వస్తుండడంతో ప్రజాప్రతినిధులు రచ్చబండకు దూరంగా ఉంటూ అధికారులతో అయిపోయిందని అనిపించేందుకు ప్రయత్నిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X