హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రణబ్‌కు తెలంగాణ ఎంపీల లేఖ: పార్టీల ఏకాభిప్రాయం తీసుకోవాలని విజ్ఞప్తి

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం వెంటనే తెలంగాణ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణకు చెందిన కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులు ఆదివారం మంత్రి ప్రణబ్ ముఖర్జీకి లేఖ రాశారు. తెలంగాణపై కేంద్రం డిసెంబర్ 9న చేసిన ప్రకటనకు కట్టుబడి ఉండాలని వారు కోరారు. తెలంగాణపై అన్ని పార్టీల ఏకాభిప్రాయం త్వరగా తీసుకోవాలన్నారు. అన్ని పార్టీల నుండి ఒకే ఆప్షన్‌ను తీసుకోవాలని వారు కోరారు. అనంతరం అఖిలపక్షాన్ని కూడా ఏర్పాటు చేయాలన్నారు. అఖిలపక్షం సాధ్యమైనంత తొందరగా ఏర్పాటు చేసి తెలంగాణను ప్రకటించాలని చెప్పారు.

వచ్చే బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణ బిల్లు ప్రవేశ పెట్టాలని లేఖలో పేర్కొన్నారు. సీమాంధ్రకు చెందిన ప్రజలు కూడా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి సిద్ధంగా ఉన్నారన్నారు. కాగా తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు ఉదయం ఎంపీ వివేక్‌ నివాసంలో భేటీ అయ్యారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక తదనంతర పరిణామాలు, తెలంగాణ అంశంలో భవిష్యత్‌ కార్యాచరణ వ్యూహంపై నేతలు చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X