అనూష తల్లిదండ్రుల హత్య కేసులో ముద్దాయి రాజేష్కు జీవిత ఖైదు
కాగా కోర్టుకు వెళ్లేముందు రాజేష్ తాను ఏ హత్యకు పాల్పడలేదని విలేకరులతో చెప్పారు. తాను తప్పు చేయనందున తనకు శిక్ష పడదని, తనకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందని వ్యాఖ్యానించాడు. అయితే అనూష మాత్రం నేరస్థుడు రాజేష్కు కఠిన శిక్ష పడాలని అభిప్రాయపడింది. ఇలాంటి దుర్మార్గానికి మరెవరూ పాల్గొనకుండా ఉండాలంటే రాజేష్కు కఠిన శిక్ష వేయాల్సిందేనన్నారు. తల్లిదండ్రులను చంపడం వలన నాకు, నా చెల్లెల్లు ఇద్దరికి తీవ్ర అన్యాయం జరిగిందన్నాడు.
కాగా అనూషను ప్రేమించమని రాజేష్ గత కొన్నేళ్లుగా హత్యకు ముందు వేధించాడు. తనను ప్రేమించాలని అనూష చుట్టూ తిరిగాడు. అయితే అనూష ఎంతకీ ఒప్పుకోక పోవడంతో రాజేష్ ఏకంగా ఆమె ఇంటికి వెళ్లాడు. ప్రేమ విషయమై అడిగాడు. అనూష ఒప్పుకోక పోవడంతో కత్తితో దాడికి ప్రయత్నించాడు. అయితే అనూషను చంపడానికి ప్రయత్నిస్తున్న రాజేష్కి తల్లిదండ్రులు అడ్డు రావడంతో వారిని పొడిచి చంపాడు. అనూష ఈ దుర్ఘటనలో తీవ్రగాయాల పాలయింది. ఈ దుర్ఘటనను మహిళాసంఘాలు తీవ్రంగా ఖండించాయి. రాజేష్ని తీవ్రంగా శిక్షించాల్సిందేనని డిమాండ్ చేశాయి. అనూష తల్లిదండ్రులు చనిపోవడంతో అనూషను ఆమె ఇద్దరు చెల్లెల్లను కొందరు ఆదుకున్నారు. మురళీ మోహన్ వారిని చదివిస్తున్నారు.