వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రై వ్యాలీ విద్యార్థులకు రేడియా ట్యాగింగ్‌పై ఎస్ఎం కృష్ణ ఆగ్రహం

By Pratap
|
Google Oneindia TeluguNews

SM Krishna
బెంగళూరు: ట్రై వ్యాలీ విశ్వవిద్యాలయంలోని భారతీయ విద్యార్థులకు రేడియా ట్యాగింగ్‌పై భార విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ఎం కృష్ణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అది అమానుషమని, అంగీకార యోగ్యం కాదని ఆయన అన్నారు. అందుకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన ఆదివారం అమెరికాను డిమాండ్ చేశారు. విద్యార్థులు నేరస్థులు కారని, విద్యార్థులకున అమర్చిన రేడియో కాలర్స్‌ను తొలగించాలని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. విద్యార్థులను పట్టుకోవడానికి వీలుగా అమెరికా విద్యార్థులకు రేడియా కాలర్స్ అమర్చారు.

ట్రై వ్యాలీ విశ్వవిద్యాలయంలో చేరిన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, వారి భవిష్యత్తు అయోమయంలో పడిందని ఆయన అన్నారు. అమెరికాలో లక్ష మంది భారతీయ విద్యార్థులున్నారని ఆయన చెప్పారు. ట్రై వ్యాలీ విశ్వవిద్యాలయం మూత పడడం వల్ల ఇబ్బందులు ఎదుర్కుంటున్న విద్యార్థులకు ఫెడరల్ ప్రభుత్వం తగిన సహాయం అందించాలని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X