హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అప్పుడు వైఎస్ ఇప్పుడు జగన్: ఫ్యాక్షనిస్టు వ్యాఖ్యలపై రోజా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Roja
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అప్పుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని, ఇప్పుడు మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకున్నాడని సినీ నటి, జగన్ వర్గం రాజకీయ నాయకురాలు రోజా సోమవారం ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ అంత్యాక్షరి కొనసాగుతుందన్నారు. జగన్‌కు వస్తున్న ప్రజాధరణ చూసి ఓర్వలేని వారే జగన్‌పై ఆరోపణలు చేస్తున్నారన్నారు. జగన్‌పై ఆరోపణలు చేస్తే సహించేది లేదన్నారు.

జగన్‌పై బురద జల్లేందుకే టిడిపి నేతలు, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారన్నారు. జగన్‌కు రాష్ట్రంలో చాలా ప్రజాధరణ ఉందన్నారు. వైఎస్‌పై ఉన్న అభిమానాన్ని ప్రజలు జగన్‌పై కురిపిస్తున్నారన్నారు. ఆయన ఎదుగుదలను, ప్రజాధరణను చూసి ఓర్వలేకే అసత్య ఆరోపణలకు పాల్పడుతున్నారన్నారు. గతంలో వైఎస్‌ను ఫ్యాక్షనిస్టుగా చిత్రీకరించారని ఇప్పుడు వైఎస్ జగన్‌ను ఫ్యాక్షనిస్టుగా చిత్రీకరించాలని ప్రయత్నిస్తున్నారన్నారు. వారు ఫ్యాక్షనిస్టులే అయితే టిడిపి అధికారంలో ఉన్న తొమ్మిదేళ్లు చంద్రబాబు విచారణ జరిపించి ఎందుకు శిక్షించలేదని ప్రశ్నించారు. టిడిపి, సిఎం కలిసిపోయి జగన్‌ను దెబ్బతీయాలని చూస్తున్నాయన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X