అప్పుడు వైఎస్ ఇప్పుడు జగన్: ఫ్యాక్షనిస్టు వ్యాఖ్యలపై రోజా
జగన్పై బురద జల్లేందుకే టిడిపి నేతలు, ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారన్నారు. జగన్కు రాష్ట్రంలో చాలా ప్రజాధరణ ఉందన్నారు. వైఎస్పై ఉన్న అభిమానాన్ని ప్రజలు జగన్పై కురిపిస్తున్నారన్నారు. ఆయన ఎదుగుదలను, ప్రజాధరణను చూసి ఓర్వలేకే అసత్య ఆరోపణలకు పాల్పడుతున్నారన్నారు. గతంలో వైఎస్ను ఫ్యాక్షనిస్టుగా చిత్రీకరించారని ఇప్పుడు వైఎస్ జగన్ను ఫ్యాక్షనిస్టుగా చిత్రీకరించాలని ప్రయత్నిస్తున్నారన్నారు. వారు ఫ్యాక్షనిస్టులే అయితే టిడిపి అధికారంలో ఉన్న తొమ్మిదేళ్లు చంద్రబాబు విచారణ జరిపించి ఎందుకు శిక్షించలేదని ప్రశ్నించారు. టిడిపి, సిఎం కలిసిపోయి జగన్ను దెబ్బతీయాలని చూస్తున్నాయన్నారు.
Comments
రోజా చంద్రబాబు కిరణ్కుమార్ రెడ్డి వైఎస్ జగన్ వైఎస్ రాజశేఖరరెడ్డి కాంగ్రెస్ హైదరాబాద్ Roja chandrababu kirankumar reddy ys jagan ys rajasekhar reddy congress hyderabad
Story first published: Monday, January 31, 2011, 16:45 [IST]