వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణకు సంకీర్ణమే అడ్డు: డిఎంకే, ఎన్సీపీ, తృణమూల్ వ్యతిరేకం?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Telangana
న్యూఢిల్లీ: రాష్ట్రంలో నిత్యం తలనొప్పులు తెచ్చి పెట్టుతున్న ప్రత్యేక తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నప్పటికీ ఆ నిర్ణయాన్ని ఆచరణలో చూపించడానికి సంకీర్ణం అడ్డుగా నిలుస్తున్నట్టుగా కనిపిస్తోంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని కాంగ్రెస్ పార్టీ నిత్యం చెబుతూనే ఉంది. అయినా తెలంగాణను రాష్ట్రాన్ని మాత్రం ప్రకటించడం లేదు. ప్రత్యేక రాష్ట్రానికి కట్టుబడి ఉన్నామని చెబుతూనే దానిని ప్రకటించక పోవడానికి కారణం సంకీర్ణ ప్రభుత్వమే. సంకీర్ణ ప్రభుత్వం కాకుండా కాంగ్రెస్ సొంతగా ప్రభుత్వాన్ని కేంద్రంలో ఏర్పాటు చేసి ఉంటే ఈ పాటికి ఎప్పుడో తెలంగాణ ప్రకటించి ఉండేదని పలువురి భావిస్తున్నారు.

కేంద్రంలో యూపిఏ సంకీర్ణ ప్రభుత్వం ఉన్నందువల్లనే తెలంగాణ ఉద్యమం ఇంత భారీ ఎత్తున జరుగుతున్నప్పటికీ కేంద్రం నాన్చుతున్నట్టుగా భావిస్తున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే దేశంలో మరిన్ని ప్రత్యేక వాదాలు బయటకు వస్తాయని యూపిఏ భాగస్వామ్యంలోని పలు పార్టీలు భావిస్తున్నాయి. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ నుండి బుందేల్‌ఖండ్, మహారాష్ట్ర నుండి విదర్భ, తమిళనాడునుండి కూడా ఇప్పటికే వస్తున్న ప్రత్యేక వాదనలకు మరింత బలం చేకూరుతుందని ఆయా రాష్ట్రాలలోని ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్‌పై ఒత్తిడి తెస్తున్నట్టుగా తెలుస్తోంది.

యూపిఏ ప్రభుత్వంలో ఉన్న డిఎంకె, తృణమూల్ కాంగ్రెస్, ఎన్సీపీ పార్టీలు ప్రత్యేక తెలంగాణను వ్యతిరేకిస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రత్యేక తెలంగాణ ప్రకటించిన నేపథ్యంలో తాము యూపిఏ నుండి విరమించుకునేందుకు కూడా వారు సిద్దంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్ బెట్టుకు పోయి తెలంగాణ ప్రకటిస్తే తమిళనాడునుండి కరుణానిధి, మహారాష్ట్రనుండి శరద్ పవార్, పశ్చిమ బెంగాల్ నుండి మమతా బెనర్జీ తదితరులు యూపీఏకు మద్దతు ఉపసంహరించుకునే అవకాశం ఉంది. ఈ కారణంగానే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అంశాన్ని జాప్యం చేయడానికి చూస్తున్నట్టుగా తెలుస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X