చర్లపల్లి జైలులో ఘర్షణ: ఐఎస్ఐ తీవ్రవాది సహా ముగ్గురికి గాయాలు
జైలులో సులేమాన్ అలీ బాయ్, వికారుద్దీన్ల వద్ద సెల్ ఫోన్లు ఉన్నాయనే ఆరోపణలు రావడంతో జైలు సిబ్బంది తనిఖీలు చేపట్టారు. ఈ సమయంలో ఐఎస్ఐ తీవ్రవాదులు జైలు సిబ్బందిపై దాడికి దిగారు. ఈ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పాపాగ్ని బ్యారక్లో జైలు సిబ్బందికి మూడు సెల్ ఫోన్లు, రెండు బుల్లెట్లు లభించాయి. పోలీసుల జోక్యంతో పరిస్థితి సద్దుమణిగిందని సైబరాబాద్ పోలీసు కమిషనర్ ద్వారకా తిరుమల రావు చెప్పారు.
Comments
Story first published: Tuesday, February 1, 2011, 9:43 [IST]