దొంగల కాల్పుల్లో కానిస్టేబుల్కు గాయాలు: మంచిర్యాలలో ఘటన
మంచిర్యాలలో కొద్ది కాలంగా దొంగతనాలు పెరగడంతో గస్తీని ముమ్మరం చేశారు. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత గస్తీ తిరుగుతున్న తిరుపతి రెడ్డి అనే కానిస్టేబుల్ హోంగార్డుతో కలిసి దొంగల ముఠాను గుర్తించి ఓ ముఠా సభ్యుడిని పట్టుకున్నాడు. ఈ సమయంలో ముఠాలోని మరో సభ్యుడు తిరుపతిరెడ్డిపైకి కాల్పులు జరిపాడు. ఐదుగురు దొంగల్లో ముగ్గురు ఉత్తరప్రదేశ్కు చెందినవారని, మరో ఇద్దరు హైదరాబాదుకు చెందినవారని భావిస్తున్నారు.
Comments
Story first published: Tuesday, February 1, 2011, 10:19 [IST]