ఆదిలాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దొంగల కాల్పుల్లో కానిస్టేబుల్‌కు గాయాలు: మంచిర్యాలలో ఘటన

By Pratap
|
Google Oneindia TeluguNews

Adilabad District
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో దొంగలు జరిపిన కాల్పుల్లో మంగళవారం తెల్లవారు జామున ఓ కానిస్టేబుల్ గాయపడ్డాడు. ఆయనను ఆస్పత్రిలో చేర్చారు. మంచిర్యాలలోని రెండు ఆభరణాల దుకాణాల్లో ఐదుగురు సభ్యులతో కూడిన దొంగల ముఠా దొంగతనానికి ప్రయత్నించింది. ఈ సమయంలో వారిని పట్టుకోవడానికి ప్రయత్నించిన కానిస్టేబులు తిరుపతి రెడ్డి గాయపడ్డాడు.

మంచిర్యాలలో కొద్ది కాలంగా దొంగతనాలు పెరగడంతో గస్తీని ముమ్మరం చేశారు. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత గస్తీ తిరుగుతున్న తిరుపతి రెడ్డి అనే కానిస్టేబుల్ హోంగార్డుతో కలిసి దొంగల ముఠాను గుర్తించి ఓ ముఠా సభ్యుడిని పట్టుకున్నాడు. ఈ సమయంలో ముఠాలోని మరో సభ్యుడు తిరుపతిరెడ్డిపైకి కాల్పులు జరిపాడు. ఐదుగురు దొంగల్లో ముగ్గురు ఉత్తరప్రదేశ్‌కు చెందినవారని, మరో ఇద్దరు హైదరాబాదుకు చెందినవారని భావిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X