హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాకాకు పిచ్చి ముదిరింది: వెంకటస్వామిపై విరుచుకు పడినకాంగ్రెసు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Congress
హైదరాబాద్: ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీపై మంగళవారంనిప్పులుకక్కిన కాంగ్రెసు పార్టీ సీనియర్ నాయకుడు వెంకటస్వామిపై ఆ పార్టీ నేతలు కూడా అదేస్థాయిలో విరుచుకు పడ్డారు. సోనియాపై కాకా చేసిన వ్యాఖ్యలు తమను తీవ్ర మనస్తాపానికి గురి చేశాయని మంత్రి దానం నాగేందర్ అన్నారు. కాకా వెంటనే క్షమాపణ చెప్పాలన్నారు. లేదంటే కాకాపై, పార్టీలో ఉన్న ఆయన కుటుంబ సభ్యులపై చర్యలు తప్పవన్నారు. సోనియాపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కాకాను పార్టీనుండి బహిష్కరించాలని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు.

పదవులు ఆశించకుండా దేశానికి సేవ చేస్తున్న త్యాగశీలి సోనియా అని మంత్రి శ్రీధర్‌బాబు కరీంనగర్‌లో అన్నారు. పార్టీ పటిష్టానికి ఎలాంటి నిర్ణయం తీసుకున్నప్పటికీ తెలంగాపై మంచి నిర్ణయం తీసుకుంటారనే ఆశాభావం ఆయన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పార్టీ పటిష్టానికి కొన్ని వ్యూహాలు అనుసరించాల్సిన అవసరం ఉంటుందన్నారు. పార్టీని పటిష్టం చేయడానికి తెలంగాణకు ఏమాత్రం సంబంధం లేదన్నారు.

కాకాకు పిచ్చి ముదిరిందని మరో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. మతి భ్రమించే సోనియాపై వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. ప్రజారాజ్యంతో పొత్తు తెలంగాణ ఇవ్వడానికే అని ఎందుకు అనుకోకూడదని ఆయన ప్రశ్నించారు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెసు‌లో విలీనం అయితే ఒకరకంగా, పొత్తు కుదిరితే ఓ రకంగా పదవి వస్తుందన్నారు. కాకా వ్యాఖ్యలపై కాంగ్రెసు నేతలకు ఎవరికీ మైండ్ బ్లాక్ అవ్వాల్సిన అవసరం లేదన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X