హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మతిభ్రమించింది, దారిన పోనే దానయ్య: కాకాపై జెసి దివాకర్ రెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

JC Diwakar Reddy
హైదరాబాద్: ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీపై కాంగ్రెసు పార్టీ సీనియర్ నాయకుడు వెంకటస్వామి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. కాంగ్రెసు పార్టీ కాకా కుటుంబానికి చాలా ఇచ్చిందన్నారు. ఆయన కుటుంబానికి పదవులు రాలేదని ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేశారన్నారు. వయసులో ఉన్న ఆయన మతిభ్రమించి ఆలా మాట్లాడుతున్నారన్నారు. దారిన పోయే ప్రతి ఒక్కరూ ఏదో మాట్లాడితే సోనియాగాంధీ స్పందించాల్సిన అవసరం లేదన్నారు. పార్టీకి ఎంతో సేవ చేస్తున్న సోనియాను అనడానికి కాకాకు నోరు ఎలా వచ్చిందన్నారు. రాష్ట్రపతి పదవి ఇవ్వలేదనే అలాంటి పరుషమైన వ్యాఖ్యలు చేసి ఉంటారన్నారు.

సీనియర్‌ను కాబట్టి ఏం మాట్లాడినా చెల్లుతుందని ఆయన భావిస్తున్నట్టున్నారన్నారు. కాకా మాటలు లోకజ్ఞానం లేని వారు మాట్లాడినట్లుగా ఉందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డే చిరంజీవికి కేంద్రమంత్రి పదవి ఇప్పిస్తానని లేఖ రాశారని జెసి అన్నారు. కాకా ఎప్పుడు మాట్లాడినా వ్యక్తిగత ప్రయోజనాలకోసమే ప్రెస్ మీట్లు పెడతారని మంత్రి మాణిక్యవరప్రసాద్ అన్నారు. ఆయన వయసు రీత్యా మాట్లాడటం లేదని, కేవలం తనకు పదవి రాలేదనే అలా మాట్లాడుతున్నారనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆయన సోనియాపై మాట్లాడటం తీవ్రమైన విషయం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X