వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రచ్చబండ రచ్చరచ్చ: మహిళలను ఈడ్చుకెళ్లిన పోలీసులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Telangana
వరంగల్: తెలంగాణలోని పలు జిల్లాల్లో రచ్చబండ కార్యక్రమాన్ని పలువురు తెలంగాణవాదులు అడ్డుకోవడం కొనసాగుతోంది. బుధవారం వరంగల్ జిల్లాలోని మంత్రి పొన్నాల లక్ష్మయ్య నియోజకవర్గం జనగామలో రచ్చబండ కార్యక్రమం రచ్చరచ్చ అయింది. దీంతో పోలీసులు, తెలంగాణవాదులకు మధ్య తీవ్ర వాగ్వాదం, లాఠీఛార్జ్, ధర్నాలు జరిగాయి. జనగామలో జరగనున్న రచ్చబండ కార్యక్రమానికి వచ్చిన అధికారులను పలువురు తెలంగాణవాదులు అడ్డుకున్నారు. అధికారులు నచ్చజెప్పినప్పటికీ వారు రచ్చబండను బహిష్కరించారు. దీంతో తెలంగాణవాదులకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.

ఆందోళనారులు ఎంతకీ వినకపోవడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. మహిళలను ఈడ్చుకు వెళ్లారు. పోలీసుల చర్యలకు నిరసనగా తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి రోడ్డెక్కింది. వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించింది. పోలీసుల చర్యలకు నిరసనగా జెఏసి సిఐ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X