సోనియాపై వ్యాఖ్యలు: వెనక్కి తగ్గని కాకా, మళ్లీ ఘాటైన విమర్శలు
చిరంజీవి ఇంటికి ఆంటోనీ వెళ్లడం తనను బాధ కలిగించిందన్నారు. పార్టీలో ఎవరికీ తనను ప్రశ్నించే అధికారం లేదన్నారు. ఇప్పుడు తనను విమర్శిస్తున్న వారు పుట్టకముందునుండే నేను కాంగ్రెసు పార్టీకి సేవలు చేస్తున్నానని చెప్పారు. పార్టీ నుండి నేనెప్పుడూ లబ్ధి పొందలేదన్నారు. పార్టీకి మాత్రం నేను చాలా సేవలు చేశానన్నారు. నాకు ఎప్పుడూ కులం ఫీలింగు లేదన్నారు. నేను గ్లాస్ రూట్ నుండి ఎదిగానన్నారు. తెలంగాణపై నేను సిడబ్లూసిలో ప్రస్తావించానన్నారు. పార్టీ అధిష్టానం తనంపై ఎలాంటి చర్యలైనా తీసుకోవచ్చునని సవాల్ చేశారు.
నేను ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి నా వెనుక ఎవరూ లేరని, అయితే నా వెనుక తెలంగాణ ఉందన్నారు. కాంగ్రెసు మానిఫెస్టోలోనే తెలంగాణ అంశం ఉందని చెప్పారు. దానికి చిరంజీవి కట్టుబడి ఉండాలన్నారు. నేనెప్పుడూ టిక్కెట్ల కోసం ఎదురు చూడలేదన్నారు. వారే నాకు టిక్కెట్లు ఇచ్చారన్నారు. నిన్నగాక మొన్న వచ్చిన రోశయ్య నన్ను విమర్శిస్తారా అని ప్రశ్నించారు. రోశయ్యకు గవర్నర్ కావాలని ఉందని, అందుకే ఏడ్చారన్నారు. నేను అంబేడ్కర్ దారిలో నడుస్తున్నానన్నారు. సమయం వచ్చినప్పుడు కొత్త పార్టీ గురించి ఆలోచిస్తానన్నారు.