హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సోనియాపై వ్యాఖ్యలు: వెనక్కి తగ్గని కాకా, మళ్లీ ఘాటైన విమర్శలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

G Venkataswamy
హైదరాబాద్: ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీపై మంగళవారం తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని కాంగ్రెసు పార్టీ సీనియర్ నాయకుడు వెంకటస్వామి బుధవారం స్పష్టం చేశారు. చిరంజీవిని కాంగ్రెసు పార్టీలో చేర్చుకోవడంతో తెలంగాణ అంశం వెనుకబడినట్లేనని ఆయన అన్నారు. సమైక్యవాది అయిన చిరంజీవితో తెలంగాణకు కట్టుబడి ఉన్న కాంగ్రెసు ఎలా కలుస్తుందన్నారు. ఒకవేళ చిరంజీవి తెలంగాణకు అనుకూలమని చెబితే నా మాటలు విత్ డ్రా చేసుకుంటానన్నారు. లేదా సోనియాగాంధీ తెలంగాణ ప్రకటించినా విత్ డ్రా చేసుకుంటానన్నారు. చిరంజీవితో కలవడమంటేనే సమైక్యవాదానికి కట్టుబడి ఉన్నట్లు అన్నారు. సమయం వచ్చినప్పుడు పార్టీ పెట్టే విషయం చెప్తానని ఆయన అన్నారు.

చిరంజీవి ఇంటికి ఆంటోనీ వెళ్లడం తనను బాధ కలిగించిందన్నారు. పార్టీలో ఎవరికీ తనను ప్రశ్నించే అధికారం లేదన్నారు. ఇప్పుడు తనను విమర్శిస్తున్న వారు పుట్టకముందునుండే నేను కాంగ్రెసు పార్టీకి సేవలు చేస్తున్నానని చెప్పారు. పార్టీ నుండి నేనెప్పుడూ లబ్ధి పొందలేదన్నారు. పార్టీకి మాత్రం నేను చాలా సేవలు చేశానన్నారు. నాకు ఎప్పుడూ కులం ఫీలింగు లేదన్నారు. నేను గ్లాస్ రూట్ నుండి ఎదిగానన్నారు. తెలంగాణపై నేను సిడబ్లూసిలో ప్రస్తావించానన్నారు. పార్టీ అధిష్టానం తనంపై ఎలాంటి చర్యలైనా తీసుకోవచ్చునని సవాల్ చేశారు.

నేను ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి నా వెనుక ఎవరూ లేరని, అయితే నా వెనుక తెలంగాణ ఉందన్నారు. కాంగ్రెసు మానిఫెస్టోలోనే తెలంగాణ అంశం ఉందని చెప్పారు. దానికి చిరంజీవి కట్టుబడి ఉండాలన్నారు. నేనెప్పుడూ టిక్కెట్ల కోసం ఎదురు చూడలేదన్నారు. వారే నాకు టిక్కెట్లు ఇచ్చారన్నారు. నిన్నగాక మొన్న వచ్చిన రోశయ్య నన్ను విమర్శిస్తారా అని ప్రశ్నించారు. రోశయ్యకు గవర్నర్ కావాలని ఉందని, అందుకే ఏడ్చారన్నారు. నేను అంబేడ్కర్ దారిలో నడుస్తున్నానన్నారు. సమయం వచ్చినప్పుడు కొత్త పార్టీ గురించి ఆలోచిస్తానన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X