హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ సాక్షి చానెల్‌పై మంత్రి బొత్స సత్యనారాయణ గరం

By Pratap
|
Google Oneindia TeluguNews

Botsa Satyanarayana
హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్‌కు చెందిన సాక్షి టీవీ చానెల్‌పై మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. వరలక్ష్మి అనే విద్యార్థి ఫీజు రీయంబర్స్‌మెంట్ రాకపోవడంతో ఆత్మహత్య చేసుకుందంటూ సాక్షి చానెల్ ఎడతెరిపి లేకుండా వార్తాకథనాలను ప్రసారం చేస్తోంది. పీజుల రీయంబర్స్‌మెంట్‌ విడుదల కావడం లేదంటూ వైయస్ జగన్ హైదరాబాదులో దీక్ష చేపట్టనున్ననేపథ్యంలో సాక్షి చానెల్ ఆ వార్తాకథనాలను ప్రసారం చేస్తోంది. దీంతో బొత్స సత్యనారాయణ గురువారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి వరలక్ష్మి మృతిపై ఓ చానెల్ దుష్ప్రచారం చేస్తోందని విమర్శించారు.

వరలక్ష్మిది ఆత్మహత్య కాదని, ప్రమాదవశాత్తు ఒళ్లు కాలి మరణించిందని ఆయన అన్నారు. వంట చేస్తుండగా మంటలు అంటుకున్నాయని వరలక్ష్మి మెజిస్ట్రేట్‌కు ఇచ్చిన వాంగ్మూలంలో కూడా చెప్పిందని ఆయన గుర్తు చేశారు. దయచేసి దుష్ప్రచారం చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల్లో అలజడి సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని చూడడం సరైంది కాదని ఆయన అన్నారు. ఫీజుల రీయంబర్స్‌మెంట్ వ్యవహారంపై ఓ మంత్రుల కమిటీ కూడా పనిచేస్తోందని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X