చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డిఎంకె ప్రధాన కార్యదర్శి పదవికి టెలికాం రాజా రాజీనామా

By Srinivas
|
Google Oneindia TeluguNews

A Raja
చెన్నై: 2జి స్పెక్ట్రం కుంభకోణంలో అరెస్టు అయిన కేంద్ర మాజీ టెలికాం మంత్రి రాజా డిఎంకె ప్రధాన కార్యదర్శి పదవికి గురువారం రాజీనామా చేశారు. పార్టీ తనపై చర్యలు తీసుకునేందుకు సమావేశం ఏర్పాటు చేసిన నేపథ్యంలో పార్టీ తనపై చర్యలు తీసుకునే కంటే ముందే ఆయన రాజీనామా చేశారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఉదయం డిఎంకె కోర్ కమిటీ సమావేశమయి రాజాపై చర్యలకు చర్చలు జరిపింది. అయితే చాలామంది రాజాను తొలగించాలని చెప్పినప్పటికీ కొందరు ఆయనను సమర్థించారు. ఈనేపథ్యంలో రాజానే స్వయంగా రాజీనామా చేశారు. ఈ సమావేశఆనికి ముఖ్యమంత్రి కరుణానిధి, ఉప ముఖ్యమంత్రి స్టాలిన్, అళగిరి, కనిమొళి తదితరులు హాజరయ్యారు.

కాగా రాజాను అరెస్టు చేసినంత మాత్రాన నిందితుడు కాదని కరుణానిధి అన్నారు. రాజాపై వచ్చిన ఆరోపణలు త్వరలో నిరూపితమవుతాయన్నారు. కాగా ప్రతిపక్ష జయలలిత సైతం రాజా అరెస్టుపై స్పందించారు. రాజా అరెస్టు చాలా చిన్న విషయమన్నారు. కాంగ్రెస్, డిఎంకెలు రాజాను అరెస్టు చేసి తప్పును కప్పి పుచ్చాలనుకుంటున్నాయని ఆరోపించారు.కాంగ్రెస్‌తో ఏర్పరుచుకున్న ఎన్నికల వ్యూహంతోనే డిఎంకె పార్టీ రాజాను అరెస్టుకు సమ్మతించిందన్నారు. ఎన్నికల సమయంలో రాజా చేసిన కుంభకోణంపై ప్రజలకు తెలియజెప్పుతామని చెప్పారు. రాజా కుంభకోణంపై జెపిసి వేయాల్సిందేనని ఆమె అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X