హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిరంజీవి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి కోమటిరెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Komitireddy Venkata Reddy
హైదరాబాద్: కాంగ్రెసు పార్టీతో దోస్తికి వస్తున్న ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు చిరంజీవి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని మంత్రి కోమటిరెడ్డి దామోదర్ రెడ్డి శుక్రవారం డిమాండ్ చేశారు. చిరంజీవి క్షమాపణ చెప్పకుండా కాంగ్రెసు‌తో కలిస్తే తెలంగాణ ప్రజలు నమ్మరని ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెసు డిసెంబర్ 9న ప్రకటించిన ప్రత్యేక తెలంగాణకు చిరంజీవి కట్టుబడి ఉండాలని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం కాంగ్రెసు ప్రభుత్వం హయాంలోనే తప్పకుండా వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఉత్తర తెలంగాణ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి రచ్చబండను తెలంగాణవాదులు అడ్డుకోవద్దని మంత్రి కోరారు. రేపటి బందును తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి ఉపసంహరించుకోవాలని ఆయన కోరారు. తెలంగాణ ఇవ్వకపోతే మంత్రులు కఠిన నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. ప్రభుత్వం కార్యక్రమం రచ్చబండ వద్ద తెలంగాణ ప్రజల్లోని ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష బయటపడిందన్నారు. దానిని అధిష్టానం ఖచ్చితంగా గుర్తిస్తుందన్నారు. రచ్చబండ కార్యక్రమంలో తెలంగాణవాదుల నిరసనలతో తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నామని చెప్పారు. పోలీసుల చర్యలు మమ్మల్ని ఎంతగానో బాధిస్తున్నాయన్నారు.

కాగా చిరంజీవి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి మద్దతు తెలపాలని కాంగ్రెసు పార్టీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి వేరుగా విలేకరులతో అన్నారు. వరలక్ష్మి మృతిపై అరోపణలు సరికాదన్నారు. గోద్రా సంఘటనలో నరేంద్రమోడి హస్తం ఉందని సిట్ తెలిపినందున ఆయన ముఖ్యమంత్రిగా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X