తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సీమాంధ్ర ఉద్యమ సన్నివేశాలు తొలగించండి: తిరుపతి జెఏసి డిమాండ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Jai Bolo Telangana
తిరుపతి: జగపతి బాబు ప్రధాన పాత్రలో తెలంగాణ అంశం ప్రధానంగా శుక్రవారం విడుదల అయిన జైబోలో తెలంగాణ చిత్రం సీమాంధ్రులను కించపరిచేదిగా ఉందని తిరుపతి ఐక్య కార్యాచరణ సమితి పేర్కొన్నది. తాము చిత్రాలను ప్రాంతాలకతీతంగా ఆదరిస్తామని, అయితే తమ ప్రాంతాన్ని కించపరిస్తే మాత్రం ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. చిత్రంలో సీమాంధ్ర ఉద్యమాన్ని కృత్రిమ ఉద్యమంగా చూపించడాన్ని తిరుపతి జెఏసి ఖండించింది. అదే తెలంగాణ ఉద్యమాన్ని ప్రజా ఉద్యమంగా చూపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాంతాలకతీతంగా సీమాంధ్రులకు అభ్యంతరంగా ఉన్న సన్నివేశాలను వెంటనే తొలగించాలని వారు డిమాండ్ చేస్తారు.

ఆ సన్నివేశాలు తొలగిస్తే మాకు అభ్యంతరం లేదని, మేమూ తెలంగాణ ప్రాంతం చిత్రంగా ఆదరిస్తామని చెప్పారు. చిత్రంలో ఆత్మహత్యా దృశ్యాలు కూడా ఉన్నాయన్నారు. ఆత్మహత్యా దృశ్యాలు పెట్టడం సరికాదన్నారు. ఆ దృశ్యాలు ఇటు సీమాంధ్ర, అటు తెలంగాణ ప్రాంత విద్యార్థులను, యువతను రెచ్చగొట్టేలా ఉన్నాయన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X