వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెవిపి అవినీతిపై విచారణ జరిపించండి: టిడిపి నేత ఎర్రంనాయుడు డిమాండ్

By Pratap
|
Google Oneindia TeluguNews

Yerram Naidu
హైదరాబాద్: ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణంలో కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్ రావు అవినీతిపై విచారణ జరిపించాలని తెలుగుదేశం సీనియర్ నేత కె. ఎర్రంనాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణంపై సిబిఐ దర్యాప్తు జరిపించాలని ఆయన కోరారు. విచారణ పూర్తయ్యే వరకు ఆర్థిక లావాదేవీలు, నిర్మాణాలు ఆపేయాలని కూడా ఆయన కోరారు. ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్, కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా టెలికం మంత్రి రాజాపై విచారణకు పూనుకున్నారని, కానీ ఆంధ్ర అవినీతి రాజాలను మాత్రం పట్టించుకోవడం లేదని ఆయన వ్యాఖ్యానించారు.

దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డిపై, ఆయన కుమారుడు వైయస్ జగన్‌పై తాము ఫిర్యాదులు చేసినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, వారి అవినీతిలో వాటాలు ఉండడం వల్లనే ప్రధాని మన్మోహన్ సింగ్ గానీ కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గానీ పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. తన పదవి ఊడిపోతుందనే భయంతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా విచారణలకు ఆదేశించడం లేదని ఆయన విమర్శించారు. పలు కుంభకోణాలు వెలుగు చూసినా ముఖ్యమంత్రి పట్టించుకోకుండా కుర్చీని కాపాడుకోవడానికే చూస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X