హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దేవుడే ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తాడు: వైయస్ జగన్ శాపనార్థాలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Ys Jagan
హైదరాబాద్‌: ఫీజు రీయంబర్స్‌మెంట్ చేయకుండా విద్యార్థిని వరలక్ష్మి మృతికి కారణమైన ప్రభుత్వానికి దేవుడే బుద్ధి చెప్తాడని మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ అన్నారు. ఫీజు రీయంబర్స్‌మెంట్ జరగకపోవడంతో కాలేజీ యాజమాన్యం ఒత్తిడితి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందని ఆరోపిస్తున్న విద్యార్థిని వరలక్ష్మి కుటుంబ సభ్యులను ఆయన శనివారం పరామర్శించారు. హైదరాబాదు సమీపంలోని రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్‌లో వరలక్ష్మి ఇంటికి వెళ్లి వారిని పరామర్శించారు. ప్రభుత్వం సకాలంలో ఫీజు రీయంబర్స్‌మెంట్ చేసి ఉంటే కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి తెచ్చి ఉండేవి కావని ఆయన అన్నారు.

గ్యాస్ సిలిండర్ పేలి ప్రమాదవశాత్తు వరలక్ష్మి మరణించిందని చెప్పడానికి వంటగదిలో ఏ విధమైన ఆనవాళ్లు లేవని, ప్రమాదవశాత్తు మరణించి ఉంటే అలాంటి ఛాయలు కనిపించేవని ఆయన అన్నారు. తప్పు జరిగితే హుందాగా ఆంగీకరించి, అటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఆ బాధ్యతను విస్మరించి ప్రభుత్వం తప్పు పట్టించేందుకు ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు. అది అత్యంత హేయమైన పని అని, అది అన్యాయమని జగన్ అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X