వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోలవరం పాదయాత్ర మంచిదే కదా..: జగన్‌కు జేసి దివాకర్ మద్దతు

By Srinivas
|
Google Oneindia TeluguNews

JC Diwakar Reddy
రాజమండ్రి: కాంగ్రెస్ పార్టీతో ప్రజారాజ్యం పార్టీ విలీనం కావడాన్ని స్వాగతిస్తున్నట్టు కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే జెసి దివాకర్ రెడ్డి ఆదివారం చెప్పారు. చిరంజీవి కలయికతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో మరింత బలపడుతుందన్నారు. పోలవరంపై మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న యాత్ర మంచిదే కదా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ చెప్పారు. రాష్ట్రం పోలవరం సాధించాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పోలవరం వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నారు. జగన్ యాత్రతో లాభం చేకూరితే మంచిదే కదా అని అన్నారు. కాగా పీఆర్పీ కాంగ్రెస్‌లో విలీనం కావటం వల్ల పార్టీకి ఎలాంటి లాభం లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.

కాగా పోలవరంపై స్వార్ధ ప్రయోజనాలతో జరిగే యాత్రల వల్ల రాష్ట్రానికి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వేరుగా విలేకరుల సమావేశంలో ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాజెక్టు జాతీయ హోదా కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు కీలక దశకు వచ్చిన సమయంలో ఇలాంటి కార్యక్రమాలు మొత్తం ప్రక్రియను దెబ్బతీస్తాయని అభిప్రాయపడ్డారు. కొందరు దీన్ని రాజకీయం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రచ్చబండ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా 90 శాతం పైగా విజయవంతమైందని అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X