విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బహిరంగ చర్చకు సిద్ధమా: దేవినేనికి మల్లాది విష్ణు సవాల్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Malladi Vishnu
విజయవాడ: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు మల్లాది విష్ణు సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చాలా అవినీతి జరిగిందంటున్న దేవినేని ఉమ ఎవరి హయాంలో ఎక్కువ అవినీతి, ఎవరి హయాంలో ఎక్కువ అభివృద్ధి జరిగిందో బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కువ అవినీతి జరిగిందని ఆయన అనటం శోచనీయమన్నారు. ఆయన చెప్పేవన్నీ ఆసత్యాలేనని ఆరోపించారు.

దేవినేని ఉమ మతిస్థిమితం కోల్పోయి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. ఉమకు మంచిబుద్ధిని, మంచి జ్ఞానాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుడిని తాను కోరుకుంటున్నానన్నారు. కాంగ్రెస్ హయాంలో ఎంత అభివృద్ధి జరిగింది, టిడిపి హయాంలో ఎంత అభివృద్ధి జరిగిందో ప్రజలందరికీ తెలుసున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X