చిరు కాంగ్రెస్లో కలవటం వల్ల తెలంగాణకు లాభం: హరీష్రావు

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కె కేశవరావు టిఆర్ఎస్ కూడా కాంగ్రెస్లో విలీనం అవుతుందని చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకా, కెకె ఎప్పుడు ఏమి మాట్లాడుతారో వారికే తెలియదన్నారు. కెకె మాటలను మేం పట్టించుకోవడం లేదన్నారు. టిడిపి, కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా వచ్చిన చిరంజీవి తెలంగాణలో తన పార్టీని కోల్పోయాడన్నారు. చిరు తెలంగాణకు వ్యతిరేకంగా ఉండటంతో తెలంగాణలోని పీఆర్పీ కార్యకర్తలు టిఆర్ఎస్తో పాటు వివిధ పార్టీలలో చేరిపోయారన్నారు. పీఆర్పీ కాంగ్రెస్లో విలీనం అయితే తెలంగాణకు మంచిదేనన్నారు. కాంగ్రెస్ సమైక్యాంధ్రకు కట్టుబడిన చిరును చేర్చుకొని తెలంగాణపై వ్యతిరేకతను తెలియజెప్పిందన్నారు.
తెలంగాణకు ఇంతకాలం రెండు పార్టీలు వ్యతిరేకంగా ఉండేవని, ఇప్పుడు పీఆర్పీ కాంగ్రెస్లో విలీనం కావడం వల్ల ఒక శత్రువు తగ్గారన్నారు. సిపిఎం ఒక్కటే పార్టీ వ్యతిరేకంగా ఉన్నా దానికి ఒక్క సీటే ఉందన్నారు. టిఆర్ఎస్ తెలంగాణ కోసం పుట్టిన పార్టీ అన్నారు. పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ బిల్లు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రం తెలంగాణ ప్రకటించిన తర్వాత కూడా తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే నడుచుకుంటామని స్పష్టం చేశారు. తెలంగాణ కోసం ప్రభుత్వానికి సహాయ నిరాకరణ తెలుపుతామని చెప్పారు. సోమవారం 200 ప్రాంతాల్లో సహాయ నిరాకరణ చేపట్టామని చెప్పారు.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications