చిరు కాంగ్రెస్లో కలవటం వల్ల తెలంగాణకు లాభం: హరీష్రావు
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కె కేశవరావు టిఆర్ఎస్ కూడా కాంగ్రెస్లో విలీనం అవుతుందని చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకా, కెకె ఎప్పుడు ఏమి మాట్లాడుతారో వారికే తెలియదన్నారు. కెకె మాటలను మేం పట్టించుకోవడం లేదన్నారు. టిడిపి, కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా వచ్చిన చిరంజీవి తెలంగాణలో తన పార్టీని కోల్పోయాడన్నారు. చిరు తెలంగాణకు వ్యతిరేకంగా ఉండటంతో తెలంగాణలోని పీఆర్పీ కార్యకర్తలు టిఆర్ఎస్తో పాటు వివిధ పార్టీలలో చేరిపోయారన్నారు. పీఆర్పీ కాంగ్రెస్లో విలీనం అయితే తెలంగాణకు మంచిదేనన్నారు. కాంగ్రెస్ సమైక్యాంధ్రకు కట్టుబడిన చిరును చేర్చుకొని తెలంగాణపై వ్యతిరేకతను తెలియజెప్పిందన్నారు.
తెలంగాణకు ఇంతకాలం రెండు పార్టీలు వ్యతిరేకంగా ఉండేవని, ఇప్పుడు పీఆర్పీ కాంగ్రెస్లో విలీనం కావడం వల్ల ఒక శత్రువు తగ్గారన్నారు. సిపిఎం ఒక్కటే పార్టీ వ్యతిరేకంగా ఉన్నా దానికి ఒక్క సీటే ఉందన్నారు. టిఆర్ఎస్ తెలంగాణ కోసం పుట్టిన పార్టీ అన్నారు. పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ బిల్లు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రం తెలంగాణ ప్రకటించిన తర్వాత కూడా తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే నడుచుకుంటామని స్పష్టం చేశారు. తెలంగాణ కోసం ప్రభుత్వానికి సహాయ నిరాకరణ తెలుపుతామని చెప్పారు. సోమవారం 200 ప్రాంతాల్లో సహాయ నిరాకరణ చేపట్టామని చెప్పారు.