వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోలవరం కోసం జగన్ పోరు: రావులపాలెం నుంచి హరితయాత్ర

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
రాజమండ్రి: పోలవరం నిర్మాణం కోసం మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన హరితయాత్ర సోమవారం ఉదయం ప్రారంభమైంది. 7వ తేదిన ప్రారంభమైన హరితయాత్ర 4 రోజుల పాటు ఉంటుంది. నాలుగు రోజులపాటు జగన్ 70 కిలోమీటర్ల మేర పాదయాత్రను చేస్తారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి శంఖుస్థాపన చేసిన పోలవరాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని జగన్ ఆరోపిస్తూ దాని నిర్మాణానికై హరితయాత్ర పేరుతో పాదయాత్రను చేపట్టారు.

పోలవరం మూడు ప్రాంతాల వారికి ఉపయోగపడుతుందని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పోలవరాన్ని ప్రారంభించారని మాజీ తుడా చైర్మన్ చెవిరెడ్డి భాస్కరరెడ్డి అన్నారు. అయితే దానిని నిర్మించడంలో పాలకులు విఫలమయ్యారన్నారు. వైఎస్ లాంటి సుభిక్ష రాష్ట్రం యువనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికే సాధ్యం అన్నారు. కాగా పోలవరం దవళేశ్వరానికి సుమారు 50 కిలోమీటర్ల పైన ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X