బయటపడిన మరో స్పెక్ట్రమ్ స్కామ్, అక్రమంగా ఎస్ - బ్యాండ్ కేటాయింపు
ఇస్రో వాణిజ్య విభాగం యాంత్రిక్స్ కార్పోరేషన్ బెంగళూర్కు చెందిన దేవాస్ అనే సంస్థకు మధ్య 2005 జనవరి 28వ తేదీన ఆ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం దేవాస్ కోసం రెండు ఉపగ్రహాలను ప్రయోగించడంతో పాటు ఎస్ - బ్యాండ్లో 20 ఏళ్ల పాటు 70 మెగా హెర్జ్ స్పెక్ట్రమ్ను ఇస్రో కేటాయించాల్సి ఉంటుంది. ఈ సంస్థకు ఇస్రో మాజీ శాస్త్రీయ కార్యదర్శి ఎం.జి. చంద్రశేఖర్ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. కంపెనీ బోర్డులో నాస్కామ్ మాజీ అధ్యక్షుడు కిరణ్ కార్నిక్ కూడా ఉన్నారు. ఈ ఒప్పందం ప్రకారం ఇస్రో జిశాట్ - 6, జీశాట్ -6ఎ ఉపగ్రహాలను ప్రయోగించాల్సి ఉంటుంది. వీటిలో పదేసి చొప్పున ట్రాన్స్ పాండర్లను దేవాస్ సంస్థ వినియోగించుకుంటుంది.
దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల మేరకు ప్రభుత్వానికి నష్టం వాటిల్లిన ఈ వ్యవహారంలో స్పెక్ట్రమ్ కేటాయింపు కోసం బిడ్లను ఎందుకు పిలువలేదని కాగా ఇస్రోను ప్రశ్నించింది. సంస్థాగతమైన నియంత్రణలు పాటించలేదని తప్పు పట్టింది. కాంట్రాక్టు వివరాలు, ప్రధాని కార్యాలయానికి, అంతరిక్ష కమిషన్కు సరైన సమాచారాం ఇవ్వలేదని తెలిపింది.