వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌ను సిఎంను చేయాలని ప్రజలు చూస్తున్నారు: మేకపాటి రాజమోహన్ రెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

Mekapati Rajamohan Reddy
రాజమండ్రి: మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసే అవకాశం ఎప్పుడు వస్తుందా అని రాష్ట్ర ప్రజానీకం ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్నారని కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. జగన్ ప్రజా నాయకుడనీ, జగన్ ముఖ్యమంత్రి కావాలనుకుంటే "సోనియాకు జై" అని ఉంటే ఈసరికే అయ్యేవారని ఆయన అన్నారు. కానీ వైఎస్ జగన్ అభిమతం అది కాదనీ, ప్రజల నుంచి ఎన్నుకోబడి పీఠమెక్కాలన్నదే ఆయన ధ్యేయమని మేకపాటి అభిప్రాయపడ్డారు.

పోలవరం ప్రాజెక్టు గురించి కొంతమంది జగన్‌కు తెలుసా అని అడుగుతున్నారనీ, అవన్నీ సాంకేతికపరమైన అంశాలని, తెలుసుకోవాలనుకుంటే అర్థగంట చాలని అన్నారు. చిరంజీవి తన అవస్థలు తను పడుతున్నాడని అన్నారు. కాకపోతే నాయకుడంటే నటించడం కాదనీ, నాయకుడనే వారికి ఓర్పు, సహనం, ధైర్యం ఉండాలనీ అంటూ పరోక్షంగా చిరుకు ఆ లక్షణాలు లేవని విమర్శించారు. అదే సమయంలో వైఎస్ జగన్‌లో మాత్రం నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు పుష్కలంగా ఉన్నాయన్నారు.

English summary
Congress MP Mekapati once again supported YS Jagan. He said, public is eager to make YS Jagan as CM. YS Jagan 
 
 has leadership qualities to become CM, he opined.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X