ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పది మందికో, ఇరవై మందికో బెదిరేది లేదు: సిఎం కిరణ్ కుమార్ రెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
ఖమ్మం: పది మందో, ఇరవై మందో రచ్చబండ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే బెదిరేది లేదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా మజ్జిగుడా గ్రామంలో ఆయన మంగళవారం రచ్చబండ కార్యక్రమంలో ప్రసంగించారు. కొంత మంది తన ప్రసంగాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఆయన ఆ విధంగా అన్నారు. తమ ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే ప్రతిపక్షాలు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని, తమ అభివృద్ధి కార్యక్రమాలను చూసి భయపడుతున్నాయని ఆయన అన్నారు.

పావలా వడ్డీతో ఆంధ్రప్రదేశ్ మహిళలు ఎంతో ప్రగతి సాధించారని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మెరుగు పరిచే సత్తా మహిళలకే ఉందని రాష్ట్ర మహిళలు నిరూపించారని ఆయన అన్నారు. ప్రజలకు 5.5 లక్షల రేషన్ కార్డులిచ్చామని, పేదలకు 4.7 లక్షల ఇళ్లు కట్టించి ఇచ్చామని ఆయన చెప్పారు. మూడు లక్షల పెన్షన్లు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. ఆరోగ్యశ్రీ కింద 5.7 లక్షల మంది లబ్ధి పొందుతున్నట్లు ఆయన తెలిపారు.

English summary
Chief Minister N Kiran Kumar Reddy lash out at Opposition parties for obstructing Rachabanda. His Government is implementing development activities for the poor, specially for women.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X