ప్రభుత్వం పడిపోయే వరకు జగన్తో ఉంటా: అంబటి రాంబాబు
రాష్ట్ర అభివృద్ధి కోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 84 ప్రాజెక్టులు చేపట్టారని ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి కార్యక్రమాలలు చప్పగా ఉన్నాయన్నారు. అదే జగన్కు మాత్రం ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. జగన్ నాయకుడు అయ్యే వరకు ప్రజలు ఆయన వెంట నడుస్తారన్నారు. జగన్మోహన్ రెడ్డి దేవుడిచ్చిన వరం అన్నారు. రేపటి తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని నిలబెట్టే వ్యక్తి జగన్ అన్నారు.
నా రాజకీయ భవిష్యత్తు గురించి నేను ఆలోచించడం లేదన్నారు. అందరూ జగన్ను సమర్థించాలన్నారు. రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయన్నారు. జగన్ త్వరలో వచ్చి అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తారని చెప్పారు. భవిష్యత్తు నాయకుడు జగనే అన్నారు. జగన్ 30 ఏళ్లు పరిపాలిస్తారన్నారు. ఇలాంటి సభ ఏ జాతీయ నాయకుడికోగానీ అష్టకష్టాలు పడితే గానీ సాధ్యం కానిదన్నారు. మూడు నెలలు, మూడేళ్లు ఎన్నికలు ఎప్పుడొచ్చినా జగన్ సిద్ధమన్నారు.