సాక్షిపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసిన చేనేత, జౌళీ శాఖమంత్రి శంకర్రావు
కాగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వరుసగా మూడోసారి కూడా అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ సాధించి తీరుతుందని విజయవాడలో అన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాలో ఆయన ఆదివారం పర్యటించారు. విజయవాడలో సమీక్షా సమావేశం నిర్వహించారు. చేనేత శాఖ అధికారులు, చేనేత సొసైటీ సభ్యులు ఈ సమీక్షకు హాజరయ్యారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఒక్కో జిల్లా నుంచి నలుగురు ప్రతినిధులు చొప్పు వస్తే ముఖ్యమంత్రితో సమీక్ష ఏర్పాటు చేయిస్తానని శంకర్రావు చేనేత సొసైటీ సభ్యులకు హామీ ఇచ్చారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.312 కోట్ల చేనేత రుణమాఫీలో తొలివిడత 109 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు, మార్చి 21 లోపు ప్రక్రియ మొత్తం పూర్తవుతుందని మంత్రి తెలిపారు.
Comments
English summary
Minister Shankar Rao fired again on Sakshi on Sunday in Guntur District. Sakshi reporter questioned Shankar Rao on KK comments towards Sonia Gandhi in his press conference.
Story first published: Sunday, February 13, 2011, 15:18 [IST]