భానుకిరణ్తో పీఆర్పీ నేత, మాజీ ఎంపీ సోదరుడికి లింక్స్?
ఈ దస్తావేజులు హెదర్గూడలోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ సమీపంలో ఉన్న సాజిద్ మెజెస్టిక్ అపార్ట్మెంట్లోని ఓ ఫ్లాట్కు సంబంధించినవిగా తెలుస్తోంది. ఈ ఫ్లాట్ను శశికుమార్ అద్దెకు తీసుకుని అద్దె ఇవ్వకుండా యజమానిని వేధిస్తున్నాడని, పైగా ఫ్లాట్ యజమాని చల్లా శ్రీనివాస్ రెడ్డితో తాను రాయించుకున్న అద్దె అగ్రిమెంట్ను ఫోర్జరీ చేసి యజమానే తనకు రూ. ఆరున్నర లక్షల అప్పు ఉన్నట్లు దొంగ సాక్ష్యాలు సృష్టించనట్లు మరో ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఫ్లాట్ యజమాని చల్లా శ్రీనివాస్ రెడ్డికి, శశికుమార్కు మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించి 2009 ఫిబ్రవరిలో రెండు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. భాను సన్నిహితుల ఇళ్లలో దొరికిన రెండు ఎఫ్ఐఆర్లు ఈ కేసులకు సంబంధించినవే. రెండేళ్ళ కిందటి ఈ ఎఫ్ఐఆర్ కాపీలు, వివాదానికి సంబంధించిన దస్తావేజులు భానుకిరణ్ వద్దకు ఎందుకు వచ్చాయన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.
ఈ వివాదంలో శశికుమార్ తన ఇంటి యజమానిపై కోర్టులో కేసు వేశారు. ఇదిలా ఉండగా 2010 డిసెంబర్ 27న అద్దె అడగడానికి వెళ్ళిన యజమాని శ్రీనివాస్రెడ్డి, అతని సోదరుడు రాజేశ్వర్రెడ్డిలపై శశికుమార్ కుటుంబ సభ్యులు దాడికి దిగారు. రాజేశ్వర్రెడ్డిని తీవ్రంగా గాయపరచారు. దీనిపై కూడా పోలీసులు కేసులు నమోదు చేసారు. రామచంద్రయ్య ఒత్తిడి మేరకు కేవలం బాధితుడు రాజేశ్వర్ రెడ్డిని మాత్రమే పోలీసులు అరెస్టు చేసినట్లు ఆరోపణ. కాగా.. శశికుమార్పై బొల్లారం పోలీస్స్టేషన్లోనూ స్థిరాస్తి ఆక్రమణ వివాదంలో కేసులున్నాయి. దీంతో వివాదస్పదుడైన శశికుమార్ సెటిల్మెంట్లకోసం భానును సంప్రదించి ఉండవచ్చనే అనుమానాలు తలెత్తుతున్నాయి.