వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అసెంబ్లీ బహిష్కరణ సరి కాదు: తెలంగాణ ఎమ్మెల్యేల పట్టుపై మనీష్ తివారీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Manish Tiwari
న్యూఢిల్లీ: తెలంగాణకు అనుకూలంగా స్పష్టమైన ప్రకటన చేసే వరకు ఢిల్లీ నుంచి వెళ్లబోమని, శాసనసభా సమావేశాల కన్నా తమకు తెలంగాణ ముఖ్యమని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు చేసిన వ్యాఖ్యలపై ఎఐసిసి అధికార ప్రతినిధి మనీష్ తివారీ బుధవారం ప్రతిస్పందించారు. శాసనసభ బడ్జెట్ సమావేశాలను బహిష్కరిస్తామని శాసనసభ్యులు అనడం సరైంది కాదని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణ సమస్యకు అంత తొందరగా పరిష్కారం లభించదని ఆయన అన్నారు. సుదీర్ఘమైన తెలంగాణ సమస్యకు ఇంత తొందరగా పరిష్కారం లభించిందని ఆయన అన్నారు.

తెలంగాణపై కాంగ్రెసు పార్టీ ఎంతో ప్రగతి సాధించిందని ఆయన అన్నారు. తెలంగాణపై ఓపికతో వ్యవహరిస్తే మంచిదని ఆయన అన్నారు. తెలంగాణపై ఏకాభిప్రాయానికి ప్రయత్నిస్తున్నామని, జఠిలమైన తెలంగాణ సమస్యకు ఏకాభిప్రాయ సాధన అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణపై అందరూ ప్రశాంతంగా ఉండాలని ఆయన అన్నారు.

English summary
AICC spokes person Manish Tiwari opposed Telangana MLAs arguement on Telangana. He said that It is not fare to boycott Assembly Budget session in protext of Tealangana issue. He said that It sis not easy to solve Telangana issue immidiately. 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X