వైయస్ జగన్ వెంట వెళ్లేవారి జాబితా పంపాలని డిఎస్ను అడిగిన మొయిలీ
పీసీసీలో కీలక పదవిలో ఉంటూనే జగన్ శిబిరం తరఫున ప్రతిరోజూ పార్టీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న నేతలు పలువురు ఉన్నారు. ఇది పార్టీశ్రేణులకు ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలో పీసీసీలో బాధ్యతలు నిర్వర్తిస్తూ జగన్వైపు వెళ్లిన వారి వివరాలను జిల్లాలవారీగా ఇవ్వాలని డీఎస్ను మొయిలీ కోరారు. దీంతో, సమాచార సేకరణలో పీసీసీ నిమగ్నమైంది. రాష్ట్రంలో నిలిచిపోయిన సంస్థాగత ఎన్నికలపైనా పీసీసీ దృష్టిసారించింది. జగన్ ప్రభావం పార్టీలో లేనందున ఈ ప్రక్రియను కొనసాగించేందుకు పీసీసీ సన్నద్ధమవుతోంది. ప్రభుత్వ పథకాల పర్యవేక్షణ కమిటీ సమావేశంలో మంగళవారం డీఎస్ సంస్థాగత ఎన్నికల అంశాన్ని ప్రస్తావించడంలో ప్రధాన ఉద్దేశం ఇదేనని పార్టీనేతలు అంటున్నారు.
Comments
వీరప్ప మొయిలీ శ్రీనివాస్ కాంగ్రెసు వైయస్ జగన్ హైదరాబాద్ veerappa moily srinivas congress ys jagan hyderabad
English summary
Congress AP affairs in charge Veerappa Moily asked PCC president D Srinivas to send the list of the leaders, who are supporting YS Jagan. Veerappa Moily called yesterday and asked about the leaders who are going with YS Jagan.
Story first published: Wednesday, February 16, 2011, 8:28 [IST]