హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కెసిఆర్‌పై వ్యాఖ్యలకు నిరసనగా పొట్టి శ్రీరాములు విగ్రహం ధ్వంసం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Potti Sriramulu
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ఒంగోలు పార్లమెంటు సభ్యుడు వేణుగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ హైదరాబాద్‌లోని వనస్థలిపురం కూడలిలోని శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని కొందరు దుండగులు మంగళవారం రాత్రి ధ్వంసం చేశారు. కెసిఆర్‌పై ఒంగోలు ఎంపీ చేసిన వ్యాఖ్యలకు నిరసనగానే తాము విగ్రహాన్ని ధ్వంసం చేసినట్లు వారు ఓ కాగితంపై రాసి అక్కడ పెట్టారు. వేణుగోపాల్ రెడ్డి కెసిఆర్‌పై చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు.

పొట్టి శ్రీరాములు విగ్రహం స్థానంలో తెలంగాణకు చెందిన ఆర్యవైశ్యుల విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని వారు పేర్కొన్నారు. తెలంగాణ కోసం పోరాటం చేస్తున్న కెసిఆర్‌ను సీమాంధ్రులు విమర్శిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

English summary
Telanganites destroyed Sri Potti Sriramulu statue in Vanasthalipuram of Hyderabad. They demanded for Telangana Arya Vysya's statue instead of Potti Sriramulu in letter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X