వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జెపిపై దాడికి నిరసనగా ట్యాంక్‌బండ్‌పై లోక్‌సత్తా మానవహారం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Jayaprakash Narayana
హైదరాబాద్‌: లోక్‌సత్తా అధ్యక్షుడు, కూకట్‌పల్లి శాసనసభ్యుడు జయప్రకాశ్ నారాయణపై తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన ఎమ్మెల్యేలు అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద దాడి చేయడాన్ని నిరసిస్తూ లోక్‌సత్తా పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ కార్యకర్తలు హుస్సేన్‌సాగర్ వద్ద ట్యాంక్‌బండ్ వద్ద మానవహారం చేపట్టారు. జెపిపై దాడిని వారు తీవ్రంగా ఖండించారు. రాజకీయాల్లో విలువల కోసం పోరాడుతున్న జెపిపై దాడిని ప్రజాస్వామ్యం దాడిగా వారు అభివర్ణించారు.

ఇలాంటి దాడులు ప్రజాస్వామ్యంలో కూడదన్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కావద్దని వారు కోరారు. ప్రజాస్వామ్య భారత్‌లో ఎవరి అభిప్రాయాలు వారికి చెప్పుకునే హక్కు ఉన్నదన్నారు. చేయి చేయి కలుపుదాం ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం వారు నినాదాలు చేశారు. కాగా లోక్‌సత్తా కార్యకర్తలపై ఎన్టీఆర్‌ గార్డెన్‌ వద్ద ఓ యువకుడు దాడికి పాల్పడ్డాడు. పోలీసులు యువకుడిని అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు

English summary
Lok Satta followers organiged Manavaharam today at Tankbund, by the attack of TRS MLAs on Jayaprakash Narayana two days before.They accused attack. They said all the people have right to say their own thoughts in democratic country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X