కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై కోర్టుకు వెళతా: షేక్ మహబూబ్ భాషా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kadapa dist map
కడప: మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉప ఎన్నికల పోటీ కోసం తీసుకుంటానని చెప్పిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై వివాదం చెలరేగుతోందని తెలుస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా నల్గొండ జిల్లాకు చెందిన శివకుమార్ అనే వ్యక్తి పేరిట ఉంది. జగన్‌ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం నుండి ఇంకా అనుమతి రానందున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరుతో పోటీ చేయడానికి శివకుమార్‌తో చర్చలు జరిపిన విషయం తెలిసిందే.

అయితే శివకుమార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తనదిగా చెప్పుకోవడాన్ని కడప జిల్లాకు చెందిన షేక్ మహబూబ్ బాషా ఖండిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరుకు సంబంధించి తాము ఇప్పటికే కోర్టులో దావా వేశామని చెప్పారు. శివకుమార్ అదే పేరుతో పార్టీ పెట్టినట్టు చెప్పుకోవడంపై కోర్టుకు వెళ్తున్నట్టు షేక్‌మహబూబ్ బాషా స్పష్టం చేశారు. తమ కేసు హైకోర్టులో పెండింగ్‌లో ఉండగానే, ఇలా పార్టీ పేరు ఉపయోగించడం న్యాయ విరుద్ధమని, అందుకే కోర్టును ఆశ్రయిస్తున్నట్టు బాషా తెలిపారు.

English summary
Mahabub Basha, Kadapa district person condemned YSR Congress Party founder and president Shiva Kumar statments. He accused Shiva Kumar Statements that He is president of YSR Conress Party. He said this issue is in Court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X