వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మావోయిస్టులు, ఒరిస్సా ప్రభుత్వంతో చర్చలకు బయలుదేరిన హరగోపాల్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Vineel Krishna
భువనేశ్వర్: మావోయిస్టులు కిడ్నాప్ చేసిన మల్కనగిరి కలెక్టర్ వినీల్ కృష్ణ విడుదల కోసం ఒరిస్సా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. వినీల్‌ను విడిపించేందుకు మానవ హక్కుల నేత ప్రొ.హరగోపాల్, ప్రొ. సోమేశ్వర్ రావు ఆదివారం హైదరాబాద్‌నుండి భువనేశ్వర్ బయలు దేరి వెళ్లారు. వారు భువనేశ్వర్‌లో నవీన్ పట్నాయక్‌ ప్రభుత్వంతో చర్చలు జరుపనున్నారు. వినీల్ కృష్ణ విడుదలకు మావోయిస్టులు ఏడు డిమాండ్లు పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఒరిస్సా ప్రభుత్వం మావోయిస్టులు పెట్టిన ఏడు డిమాండ్లకు ఒప్పుకునేలా ఉన్నట్టుగా కనిపించడం లేదు.

పోలీసుల అదుపులో ఉన్న ఆర్‌కె భార్య పద్మతో పాటు మరో నలుగురిని, గంటి ప్రసాద్‌ను, నల్లమలలో కూంబింగ్‌ను ఆపడం వంటి పలు డిమాండ్లు మావోయిస్టులు ప్రభుత్వం ముందు ఉంచారు. అయితే ఈరోజు మధ్యాహ్నం హరగోపాల్ నవీన్ ప్రభుత్వంతో చర్చలు జరిపిన అనంతరం ప్రభుత్వం ఏఏ డిమాండ్లకు ఒప్పుకుంటుందో తెలిసే అవకాశం ఉంది. కానీ మావోల అన్ని డిమాండ్లను మాత్రం అంగీకరించేందుకు సిద్ధంగా లేనట్లుగా తెలుస్తోంది. ఈరోజు సాయంత్రంగానీ, రేపు గానీ హరగోపాల్ మావోయిస్టులతో చర్చలు జరిపే అవకాశం ఉంది.

English summary
Pro.Hara Gopal and Pro.Someshwar Rao will reach Bhuvaneshwar Sunday afternoon to talk with Orissa government on Malkanagiri collector Vineel Krishna kidnap. Sunday evening or Monday morning Hara Gopal will talks 
 
 with Maoists.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X