వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

28వ తేదీన తెలంగాణ పార్టీ ఎంపీలతో ప్రణబ్ ముఖర్జీ భేటీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Pranab Mukherjee
న్యూఢిల్లీ: తెలంగాణ అంశంపై చర్చించడానికి ఈ నెల 28వ తారీఖున తెలంగాణ కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులతో కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి ప్రణబ్ ముఖర్జీ సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ అధికార ప్రతినిధి షకీల్ అహ్మద్ చెప్పినట్లుగా తెలుస్తోంది. బడ్జెట్ సమావేశాల తర్వాత ప్రణబ్ తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలతో సమావేశమవుతారని చెప్పారు. రాష్ట్రంలో తీవ్రంగా ఉన్న ఈ సమస్యను పరిష్కరించేందుకు కేంద్రం ప్రభుత్వం సిద్దంగా ఉందని చెప్పారు.

ముందుగా బడ్జెట్ సమావేశాలు సాఫీగా సాగేందుకు ఎంపీలు సహకరించాలని ఆయన కోరినట్లుగా తెలుస్తోంది. సమావేశాలు సాఫీగా సాగిన తర్వాత తెలంగాణకు శాశ్వత పరిష్కారం దిశగా ఆలోచించే ప్రయత్నాలు చేస్తామని చెప్పినట్లుగా తెలుస్తోంది. తెలంగాణ ఎంపీలు రాజీనామా చేస్తామని అధిష్టానాన్ని హెచ్చరించడం, గత డిసెంబర్ 9న కేంద్రం ప్రకటించిన హామీకి కట్టుబడి ఉండాలని వారు డిమాండ్ చేయడం వంటి తదితర పరిణామాల దృష్ట్యా తెలంగాణ సమస్యకు తొందరగా పరిష్కారం కనుగునే దిశలో కేంద్రం యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది.

English summary
Central Finance Minister Pranabh Mukharjee will meet Telangana Congress MPs after budget session. Congress senior leader Shakeel Ahmed confirmed it today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X