ప్రముఖ తెలుగు రచయిత ముళ్లవూడి వెంకటరమణ కన్నుమూత
సాక్షి, ముత్యాల ముగ్గు, పెళ్లిపుస్తకం, మిస్టర్ పెళ్లాం, రాధాగోపాళం తదితర సినిమాలకు రమణ రచయితగా పనిచేశారు. మూగమనసులు సినిమాకు కథాసహకారం అందించారు. రక్తసంబంధం మాటల రచయితగా, అక్కినేని నాగేశ్వరరావు నటించిన బుద్ధిమంతుడు, అందాల రాముడు సినిమాలకు కథారచయితగా పనిచేసిన ముళ్లపూడి సినీ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశారు.
ముళ్లపూడి వెంకటరమణ రాసిన పిల్లల పుస్తకం 'బుడుగు' తెలుగు సాహిత్యంలో విశిష్టమైన స్థానం పొందింది. జర్నలిస్టుగా కెరీర్ ప్రారంభించిన రమణ 'దాగుడుమూతలు' సినిమాతో పూర్తిస్థాయి సినీ రచయితగా మారారు. తాజాగా బాపు దర్శకత్వంలో బాలకృష్ణతో రూపొందుతున్న 'శ్రీరామరాజ్యం' సినిమాకు ముళ్లపూడే రచయిత. ఆయన రాసిన ఆత్మకథ 'కోతికొమ్మచ్చి' విశేషంగా పాఠకాదరణ పొందింది. ముళ్లపూడి వెంకట రమణ మృతి పట్ల సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి లోనయింది. ఆయన రాసిన ఱుణానందలహరి అనే వ్యంగ్య రచన తెలుగు పాఠకుల మదిని దోచుకుంది.