వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బెంగళూరులో ఉరేసుకున్న ఆంధ్రప్రదేశ్ టెక్కీ భార్య అనూష

By Pratap
|
Google Oneindia TeluguNews

Karnataka Map
బెంగళూరు: రెండేళ్ల క్రితం ఓ టెక్కీని పెళ్లి చేసుకున్న 25 ఏళ్ల ఫిజియోథెరిపిస్టు బెంగళూరులోని శక్తినగర్ కెఆర్ పురం పోలీసు స్టేషన్ పరిధిలో తన దుపట్టాతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మృతురాలు అనూషకు పది నెలల పాప ఉంది. ఆమె భర్త టెక్కీ రామకృష్ణను, ఆమె మామ రామమూర్తిని, అత్త జయలక్ష్మిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ సంఘటన మధ్యాహ్నం పన్నెండున్నర గంటల ప్రాంతంలో జరిగింది. బాత్రూంలో స్నానానికి వెళ్లిన అనూష ఎంతకీ బయటకు రాకపోవడంతో జయలక్ష్మి పిలిచింది. అయినా స్పందన రాకపోవడంతో కిటికీలోంచి చూసింది. అనూష శవం బాత్రూంలో దుపట్టాతో ఉరివేసుకుని కనిపించింది. వరకట్నం కోసం తన కూతురును రామకృష్ణ, అతని కుటుంబ సభ్యులు తీవ్రంగా వేధిస్తూ వచ్చారని అనూష తల్లి పద్మావతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కూతురు అనూషకు తనిష్క పుట్టిన తర్వాత వారి ఒత్తిడి మరీ ఎక్కువైందని ఆమె చెప్పింది.

English summary
A 25-year-old physiotherapist, who got married two years ago, allegedly committed suicide by hanging herself with her dupatta, in her house at Shakti Nagar in KR Puram police station limits.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X