హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ విషయం ఎన్నికల్లో ప్రజలే చూసుకుంటారు: విహెచ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

V Hanumantha Rao
హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వాన్ని కూల్చే దమ్ము ఉందా అని, జగన్‌కు ప్రభుత్వాన్ని కూల్చే దమ్ము ఉందో లేదో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ చూసుకుంటారని కాంగ్రెసు పార్టీ సీనియర్ నాయకుడు వి హనుమంతరావు శనివారం విలేకరులతో అన్నారు. జగన్ తన ఫీజు పోరు ముగింపు సభలో ఈ ప్రభుత్వాన్ని ఇంకా ఉంచితే దేవుడు క్షమించడని అనడాన్ని ఆయన తప్పు పట్టారు. కూల్చే దమ్ము ఉంటే కూల్చుకోవచ్చని అన్నారు. వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్న జగన్ అన్ని డబ్బులు ఎలా సంపాదించాలో చెప్పాలని ప్రశ్నించారు.

జగన్ ఇప్పుడు నీతులు చెబుతున్నారని, కానీ ఆయన అన్ని ఎలా సంపాదించారో చెప్పాలన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి అధికారంలోకి రాకముందు వారి ఆస్తి ఎంత, ఇప్పుడు ఎంత అని ఆయన ప్రశ్నించారు. ప్రజలంతా జగన్‌ను చూస్తున్నారని, ప్రజలే ఎన్నికలలో సరైన నిర్ణయం తీసుకుంటారని అన్నారు. అవినీతితో సంపాదించిన డబ్బుతో జగన్ కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఎమ్మార్, ఓబుళాపురం గనులు అన్ని అక్రమాలపైనా ప్రభుత్వం దర్యాఫ్తు జరపాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల్లో చాలా మార్పు వచ్చిందని, వారు అవినీతికి తిరగబడే రోజు వచ్చిందన్నారు.

English summary
Congress Senior leader V Hanumantha Rao said Public will respond in election on Ex MP YS Jaganmohan Reddy corruption. He questioned YS Jagan how he got lot of money.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X