ఎపి ఇంచార్జీగా మొయిలీ ఔట్, ఆజాద్ ఇన్: సిడబ్ల్యుసిలోకి రాహుల్
కాగా, సిడబ్ల్యుసిలో రాష్ట్రానికి మొండిచేయే ఎదురైంది. ప్రాంతీయ ఉద్యమాల నేపథ్యంలో రాష్ట్రానికి చెందిన ఎవరిని కూడా సిడబ్ల్యుసిలోకి తీసుకోలేదు. సంజీవరెడ్డి మాత్రం ప్రత్యేక ఆహ్వానితుడిగా కొనసాగుతారు. జి. వెంకటస్వామికి, కె. కేశవరావుకు చోటు దక్కలేదు. పశ్చిమ బెంగాల్ పార్టీ వ్యవహారాల ఇంచార్జీగా కేశవరావును తొలగించారు. కిశోర్ చంద్రదేవ్, నేదురుమల్లి జనార్దన్ రెడ్డిలకు కూడా చోటు దక్కలేదు. వి. హనుమంతరావు, పొంగులేటి సుధాకర్ రెడ్డి మాత్రం ఎఐసిసి కార్యదర్సులుగా కొనసాగుతారు. గులాం నబీ ఆజాద్కు సహాయకులుగా కెబి కృష్ణమూర్తి, శాంతారాం నాయక్ వ్యవహరిస్తారు.
రాహుల్ గాంధీని సిడబ్ల్యుసిలోకి తీసుకున్నారు. ఆయన యూత్ కాంగ్రెసు, ఎన్ఎస్యుఐ బాధ్యతలు చూస్తారు. సోనియా రాజకీయ సలహాదారుగా అహ్మద్ పటేల్ కొనసాగుతారు. సిడబ్ల్యుసిలో సోనియా, మన్మోహన్ సింగ్లతో పాటు పి. చిదంబరం, ప్రణబ్ ముఖర్జీ, ఎకె ఆంటోనీ, దిగ్విజయ్ సింగ్, మోతీలాల్ ఓరా, ముఖుల్ వాస్నిక్ కొనసాగుతారు.