సిఎం ఆఫీసు ముందు జీతాల కోసం సీమాంధ్ర ఉద్యోగుల ధర్నా
తెలంగాణ ఉద్యోగుల సహాయ నిరాకరణ వల్ల జీతాలు ఆగిపోతే ఎవరైతే పని చేయలేదో వారికి జీతాలు ఇవ్వకూడదని అన్నారు. పని చేసిన మాకు జీతాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎవరు పని లేదో ప్రభుత్వానికి తేల్చుకోవడానికి పెద్ద పనేమీ కాదన్నారు. అయితే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలంగాణ ఉద్యోగ జెఏసితో సమావేశమయ్యారని, ఆయన తన నిర్ణయాన్ని ఆ తర్వాత ప్రకటించే అవకాశం ఉందని చెప్పారు. తెలంగాణ ఉద్యోగ సమస్యలపై ఏం నిర్ణయం తీసుకున్నప్పటికీ తమ జీతాలు మాత్రం ఆపకూడదని అన్నారు. గతంలో జీతాల కోసం ధర్నాలు చేసే పరిస్థితి ఎప్పుడూ రాలేదన్నారు.
English summary
Seemandhra employees organiged dharna at CM chamber in Secretariat. They demanded for salaries. They blamed government for salaries.
Story first published: Friday, March 4, 2011, 16:15 [IST]