జగన్ పార్టీకి మనుగడ లేదు, సిఎం పదవికే ఆరాటం: చంద్రబాబు
ప్రజావ్యతిరేక కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం కేవలం టిడిపియే అన్నారు. కాంగ్రెస్తో రాజీపడనిది కేవలం టిడిపీయే అన్నారు. అవీనితి వల్లే దేశం అభివృద్ధి కుంటుపడిందని ఆయన అన్నారు. కేంద్రం నగదు బదిలీ పథకం ప్రవేశ పెడతానని చెప్పడం హర్షణీయమని అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం ఖాయమని అన్నారు. అవీనితిపై ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాజకీయాల్లో ఎన్టీఆర్ ఉన్నత విలువలు పాటించారని కొనియాడారు. టిడిపి హయాంలోనే రాష్ట్ర అభివృద్ధి జరిగిందన్నారు. ఆదాయం కూడా పెరిగిందని అన్నారు.
ప్రస్తుతం పాలన పూర్తిగా స్థంభించిపోయిందన్నారు. ప్రజావ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వచ్చి ప్రజలకు మేలు కలిగించే దిశలో పని చేస్తామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పాలన పూర్తిగా స్తంభించిపోయిందన్నారు. ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డిని సిఎంగా కాంగ్రెస్ పార్టీ వారే గుర్తించే స్థితిలో లేరన్నారు. బలహీన వర్గాలు, పేదలు ఉన్న జిల్లాలో టిడిపి కంచుకోట అని అన్నారు. అనంతపురం జిల్లాతో టిడిపికి విడదీయరాని అనుబంధముందని చెప్పారు.