హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నాగం ఉంటే నేను వెళ్లను, ఆయనతో పని చేయను: మోత్కుపల్లి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Nagam Janardhan Reddy
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ తెలంగాణలో విభేదాలు తారాస్థాయికి చేరినట్లుగా తెలుస్తోంది. తెలంగాణ టిడిపి ఎమ్మెల్యేల్లో విభేదాలు రోజురోజుకు భగ్గుమంటున్నాయి. అంత చల్లబడిందనుకుంటున్న ఈ తరుణంలో తాజాగా టిడిపి సీనియర్ శాసనసభ్యుడు మోత్కుపల్లి నరసింహులు మరో స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఈ స్టేట్‌మెంట్‌తో విభేదాలు చల్లబడినాయి అని అనుకున్నప్పటికీ నాగం జనార్ధన్ రెడ్డి - మోత్కుపల్లి నరసింహులు మధ్య విభేదాలు మాత్రం రోజు రోజుకు పెరుగుతున్నట్టుగా కనిపిస్తున్నాయి.

తాజాగా మోత్కుపల్లి తన పార్టీకే చెందిన నాగం జనార్ధన్ రెడ్డితో తాను పని చేయనని ఆయన చెప్పారు. ఆయనతో పని చేయడం ఇష్టం లేదని చెప్పారు. టిడిపి తెలంగాణ ఫోరంకు నాగం నాయకత్వాన్ని ఆమోదించే ప్రసక్తే లేదని ఆయన ఖరాఖండిగా చెబుతున్నారు. నాగం జనార్ధన్ రెడ్డి తెలంగాణ టిడిపి ఫోరం కన్వీనర్‌గా ఉన్నంత కాలం తాను సమావేశాలకు వెళ్లేది లేదని తేల్చి చెప్పారు. అంతేకాకుండా తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్తో కలిసి పని చేస్తానని చెప్పారు.

English summary
It seems differences are much more increasing in Telangana TDP by senior MLA Mothkupally Narasimhulu statement today. He said that he will not work along with another MLA Nagam Janardhan Reddy. He said that he will work along with Telangana JAC chairman Kodandaram.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X