కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్‌పై కుట్ర: మంత్రులపై మాజీ ఎంపీ నేతల మండిపాటు

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
కడప: మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టను, ప్రజలలో ఆయనకు ఉన్న ప్రాధాన్యతను ఎవరూ ఆపలేరని జగన్ వర్గానికి చెందిన నేతలు ఆదినారాయణ రెడ్డి, అమరనాథ్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డిలు శుక్రవారం అన్నారు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడిని ఎవరూ ఆపలేనట్లే సూర్యుడిలాంటి జగన్‌ను కూడా ఎవరూ అడ్డుకోలేరని అన్నారు. జిల్లా మంత్రులు జగన్‌ను దెబ్బతీసేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.

శాసనమండలి ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ప్రలోభ పెడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెసు పార్టీ ప్రభుత్వంలో రాష్ట్రం ఓ వైపు అతలాకుతలం అవుతుంటే మంత్రులు మాత్రం బాధ్యత లేకుండా కడప జిల్లాలో ఎన్నికలపై దృష్టి పెట్టారని ఆరోపించారు. జిల్లాలో మంత్రులు తీవ్రస్థాయిలో అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని విమర్శించారు. అక్రమ పద్ధతుల్లో ఎన్నికల్లో గెలవాలని అనుకోవడం సరికాదన్నారు.

English summary
Ex MP YS Jaganmohan Reddy camp MLAs alleged district ministers that they are trying to disappear Jagan's image. They accused ministers attitude in MLC election.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X