ట్యాంక్బండ్ విగ్రహాల విధ్వంసంపై కెసిఆర్, కోదండరామ్లపై కేసులు
ట్యాంక్బండ్పై విగ్రహాలను ధ్వంసం చేసిన 56 మందిని అరెస్టు చేశారు. మరికొందరు అనుమానితుల కోసం గాలిస్తున్నారు. మీడియా ప్రతినిధులపై దాడి, కెమెరాల ధ్వంసం, ఈటీవీ ప్రత్యక్ష ప్రసార వాహనానికి నిప్పు పెట్టిన సంఘటనలపై దర్యాప్తు కొనసాగిస్తున్నామని మధ్య మండలం డీసీపీ డాక్టర్ అకున్ సబర్వాల్ తెలిపారు. ట్యాంక్బండ్పై జరిగిన విధ్వంసం, అనంతర పరిణామాలపై మొత్తం 16 కేసులు నమోదు చేశామని వివరించారు.
విగ్రహాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించిన వారిలో కొందరిని, ధ్వంసం చేస్తున్నప్పుడు రెచ్చగొట్టే ప్రసంగాలు, నినాదాలు చేసిన వారిలో కొందరిని ఇలా 48 మందిని సంఘటన జరిగిన వెంటనే గురువారమే అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం మరో 8 మందిని పట్టుకున్నారు. మొత్తం 56 మందిని అరెస్టు చేశారు. వీరంతా 25-35 ఏళ్లలోపు వారేనని గుర్తించారు. వీరిలో తెరాస నాయకులు, ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు, నలుగురు న్యాయవాదులు, ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉన్నారు. వీరిని శుక్రవారం కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు.