వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అలా ఐతే తెలంగాణ వస్తుందా: కోదండరామ్‌కు ఎర్రన్నాయుడు ప్రశ్న

By Srinivas
|
Google Oneindia TeluguNews

Yerrannaidu
శ్రీకాకుళం: రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మారిస్తే తెలంగాణ వస్తుందా అని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఎర్రన్నాయుడు ఆదివారం శ్రీకాళం జిల్లాలో అన్నారు. అసెంబ్లీకి పిండ ప్రధానం చేస్తామని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అనడం రాజ్యాంగ విరుద్దమని అన్నారు. టాంక్‌బండ్‌పై మహనీయుల విగ్రహాల ధ్వంసం వెనుక కోదండరామ్ హస్తం ఉందని ఆయన ఆరోపించారు. ఓ ఉన్నత పదవిలో ఉన్న కోదండరామ్ రాజ్యాంగ విరుద్ద ప్రకటనలు చేయడం విచారకరమన్నారు.

రాజ్యాంగం మీద నమ్మకం లేని వారు ప్రత్యేక రాష్ట్రం ఎలా సాధిస్తారని ఆయన ప్రశ్నించారు. కోదండరామ్‌పై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ట్యాంక్‌బండ్‌పై ధ్వంసం చేసిన విగ్రహాలను పునఃప్రతిష్ఠించాలని ఎర్రంనాయుడు కోరారు.

English summary
TDP senior leader Yerrannaidu questioned Telangana political jac chairman today on statues destroyed issue in million march. He condemned kodandaram statement on assembly also.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X